Alladurg : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని మాందాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం గ్రామ సర్పంచ్ రమ్య భూమిరెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలను, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం మరియు ఇతర సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Mandapur School Inspection
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణ, గ్రామ కార్యదర్శి జనార్ధన్, వార్డు సభ్యులు భాస్కర్, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.