Uppari Nandini Memory మరణించినా తన జ్ఞాపకాలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలని, నలుగురికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని ఎల్లంపల్లి సర్పంచ్ మమత నవీన్ అన్నారు. మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఉప్పరి నందిని జ్ఞాపకార్థం బస్సు షెల్టర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు.
Uppari Nandini Memory భార్యపై ప్రేమతో..
నందిని భర్త రాజు మాట్లాడుతూ.. తన భార్య దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయని భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె గుర్తుగా కేవలం చలివేంద్రమే కాకుండా, బస్సు స్టాప్ వద్ద ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా తన భార్య జ్ఞాపకాలతో సజీవంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని అభినందించారు.