Jonagoni Yadagiri సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, సాహితీ అభిమాని జోనగోని యాదగిరి ప్రతిష్టాత్మకమైన ‘తెలుగు వెలుగు’ జాతీయ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన యాదగిరి, గత 25 ఏళ్లుగా వివిధ సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు రాజకుమార్ తెలిపారు.
Jonagoni Yadagiri ఘనంగా సన్మానం
కరీంనగర్లోని ఫిలిం భవన్లో తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ పురస్కార ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న యూట్యూబ్ స్టార్ నటులు ఆర్ఎస్ నంద, గుంటి రాధిక చేతుల మీదుగా యాదగిరి ఈ అవార్డును అందుకున్నారు. సుదీర్ఘ కాలంగా ఆయన చేస్తున్న నిరంతర కృషిని అతిథులు ఈ సందర్భంగా కొనియాడారు.