Organ Transplantation : రాష్ట్రంలో అవయవ దానాలను ప్రోత్సహించడంతో పాటు, సామాన్యులకు కూడా అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులో ఉండేలా సమగ్ర విధానాన్ని తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో THOTA (ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆక్ట్) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో అవయవ మార్పిడి Organ Transplantation చికిత్స లపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలన్నారు .

రాష్ట్రంలో ఆర్గాన్ డొనేషన్స్ యాక్ట్ సమర్థవంతంగా అమలు అయ్యేలా అవసరమైన సమగ్ర పాలసీ రూపకల్పనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు.
ప్రైవేటు ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్స ల ధరల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అవయవ మార్పిడి చికిత్సలకు అయ్యే ఖర్చును భరించే విధంగా ధరల నియంత్రణ ఉండాలని మంత్రి ప్రైవేట్ యాజమాన్యాల కు సూచించారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహ చేసిన సూచనలకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. దాతలు ఇచ్చిన అవయవాలు వృధా కాకుండా ఆస్పత్రులు ప్రత్యేక చర్యలను చేపట్టాలన్నారు. ఇతర దేశాల నుండి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చే రోగుల కోసం నూతన విధివిధానాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Organ Transplantation Policy Telangana
ప్రైవేటు ఆసుపత్రుల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్యశాఖ అవయవ మార్పిడి Organ Transplantation చికిత్సలకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం 4 ఆసుపత్రులు అనుమతులు ఇచ్చామన్నారు.

అలాగే, రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి ప్రవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారుల ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులలో సామాన్యులకు వైద్య ఖర్చులు భారం కాకుండా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స లకు అయ్యే టారిఫ్ పై నియంత్రణ ఉండేలా కార్యాచరణ కు శ్రీకారం చుట్టామన్నారు .
ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర కుమార్, జీవన్ దాన్ డైరెక్టర్ డా. శ్రీ భూషణ్ రాజ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.