Mahabubnagar Medical Hub : దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Mahabubnagar Medical Hub : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను దక్షిణ తెలంగాణలోనే ప్రధాన మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’, ‘ఆరోగ్య అవగాహన వారోత్సవాల’లో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఉస్మానియా తరహాలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ!

హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి దీటుగా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీని Mahabubnagar Medical Hub అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కీలక మార్పులు చేపట్టబోతున్నారు.

Mahabubnagar Medical Hub  దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్
  • అదనపు విభాగాలు: ప్రస్తుతం ఉన్న 21 డిపార్ట్‌మెంట్‌లకు అదనంగా మరో 14 కొత్త డిపార్ట్‌మెంట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
  • సీట్ల పెంపు: కాలేజీలో పీజీ (PG) సీట్లను పెంచడంతో పాటు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలను వేగవంతం చేస్తారు.
  • మౌలిక సదుపాయాలు: విద్యార్థుల కోసం అత్యాధునిక హాస్టల్స్, ఆడిటోరియం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కల్పిస్తారు.

Mahabubnagar Medical Hub సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక ఇక్కడే!

సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పి.హెచ్.సి (PHC) నుండి సూపర్ స్పెషాలిటీ వరకు వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

  1. రిఫరల్ సెంటర్: మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీని రిఫరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తారు. దీనివల్ల 95 శాతం చికిత్సలు జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి రానున్నాయి.
  2. అవయవ మార్పిడి: త్వరలోనే ఇక్కడ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్, వాస్కులర్ యాక్సెస్ సెంటర్, ప్రత్యేక సర్జికల్ డిపార్ట్‌మెంట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
  3. ట్రామా కేర్: జాతీయ రహదారుల వెంట ప్రమాద బాధితుల కోసం ప్రత్యేక ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు.
Mahabubnagar Medical Hub

నర్సింగ్ పోస్టుల భర్తీ.. కొత్త భవనాలు

రాష్ట్రవ్యాప్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్‌లో నర్సింగ్ కాలేజీకి కొత్త భవనం, హాస్టల్ మరియు బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ‘డైరెక్టర్ సెకండరీ హెల్త్’ (DSH)గా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థులతో ముఖాముఖి

ఈ పర్యటనలో భాగంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మెడికల్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

Mahabubnagar Medical Hub  దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, కలెక్టర్ కుష్బూ గుప్తా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.